Monday, April 29, 2024
- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..6 మృతి ప‌లువురికి తీవ్ర గాయాలు

- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి ఎలార్తి దర్గాకు వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని ఆలూరు మండలం పెద్దహోతురు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మృతి చెంద‌గా మ‌రో 15 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు.వీరంతా కర్నూలు వన్‌టౌన్‌కు చెందినవారుగా గుర్తించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Six died in karnool Road accident

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -