మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోవిడ్ సవాళ్లు- పరిష్కారాలు’ అనే అంశం మీద శనివారం ఓ వెబినార్ను నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని పేర్కొన్నారు. తన భార్యది ఆంధ్రప్రదేశ్ కావడం తనకు ఎంతో గర్వకారణం అని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 18ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతున్నామని ఆయన చెప్పారు. సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని సోనూసూద్ పేర్కొన్నారు. ఈ దేశంలో ఇంకా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కోవిడ్తో ఉపాధి కోల్పోయి.. ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. తన వంతుగా కొంత సాయం చేస్తున్నానని చెప్పారు. ఈ సాయం సరిపోదని తనకూ తెలుసన్నారు.
Also Read: సోనూసూద్ .. మరో సంచలన నిర్ణయం
ఈ సందర్భంగా చంద్రబాబు సోనూ సూద్ సేవలను కొనియాడారు. తన జీవితంలో ఎన్నో విపత్తులను చూశాను కానీ.. కోవిడ్ వంటి సంక్షోభం చూడలేదని, ఇలాంటి సంక్షోభంలో సోనుసూద్ అందరికీ అండగా నిలబడుతున్నారన్నారు. ఈ ఆపత్కాలంలో సాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ సోనూ రియల్ హీరోగా మారారని ప్రశంసించారు. సోనూ చేస్తున్న సేవలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, ఆయన తన సేవలను కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.