Wednesday, April 24, 2024
- Advertisement -

లైవ్​లో ‘గజరాజు’ మూవీ చూసినట్టుంది? వీడియో వైరల్

- Advertisement -

ఏనుగుల పోరాటాన్ని మనం సినిమాల్లోనో, నేషనల్​ జియోగ్రఫీ చానల్​లోనో చూస్తుంటాం. కానీ లైవ్​లో రెండు ఏనుగులు తలపడ్డాయి.. ఒక దానిమీద పడి మరొకటి భీకరంగా దాడి చేసుకున్నాయి. ఏనుగుల అరుపులతో ఆ ప్రాంతం మొత్తం అట్టుడికిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఏనుగులు అంత భీకరంగా పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో ? ఇప్పుడు తెలుసుకుందాం..

కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. పశ్చిమ కనుమలకు నెలవైన ఈ అడవుల్లో ఏనుగులు వందల సంఖ్యలో ఉంటాయి. అయితే ఈ ఏనుగుల గుంపు అప్పుడప్పుడు సమీప గ్రామాల్లోకి వస్తుంటుంది. అవి గ్రామాల్లోకి వస్తే.. ఆస్తినష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. దీంతో సదరు గ్రామస్థులు, అటవీ అధికారులు ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏనుగులు అడవుల నుంచి గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాటికి శిక్షణ ఇచ్చిన ఏనుగులు నిలువరిస్తుంటాయి. ప్రస్తుతం ఇక్కడ అటువంటి ఘటనే జరిగింది.

Also Read: థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

ఓ అడవి ఏనుగు గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. శిక్షణ ఇచ్చిన ఏనుగు దాన్ని నిలువరించింది. ఈక్రమంలో రెండు ఏనుగులు తీవ్రంగా పోరాడాయి. మరోవైపు ఈ ఘటనను జంతు ప్రేమికులు తప్పుపడుతున్నారు. ఏనుగులను నిలువరించేందుకు శిక్షణ ఇచ్చిన ఏనుగులను తీసుకొస్తున్నారు. దీనివల్ల బలహీనంగా ఉన్న ఏనుగు గాయాలపాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని వారు కోరుతున్నారు. మొత్తంగా ఈ ఏనుగుల ఫైట్​ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: ఆశ్చర్యం.. చికెన్​ లెగ్​పీస్​ రూ. 73 లక్షలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -