- Advertisement -
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ సంఘటనపై బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించారు. ఈ ఘటనను న్యూస్ లో చూసి షాక్ అయ్యానన్నారు. మైనర్ … మేజర్ కాదు.. నిందితులు ఎలాంటి క్రైం చేశారనేది ముఖ్యం అన్నారు సోనుసూద్. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు.
నిందితులకు మాత్రం కఠిన శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణం అవుతున్నాయనేది చాలా తప్పు అని సోను చెప్పారు. జూబ్లిహిల్స్ గ్యాంగ్రేపు కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మైనర్ల వాంగూలాలను రికార్డు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇంగ్లీషు సినిమాలు, వెబ్ సిరీస్లను చూసే అలవాటుందని, అవి చూసే బాలికపై అత్యాచారం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు నిందితులు.
Also Read