- Advertisement -
మార్పు మంత్రంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్, కమలా హారిస్కు మరో గౌరవం దక్కింది. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ వారిద్దరినీ సంయుక్తంగా ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసింది. తుది జాబితాలో బైడెన్, కమలతో పాటు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ, జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. చివరకు బైడెన్-కమల ఎంపికయ్యారు.
గత ఏడాది స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ను పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఎంపికైన వారిలో థన్బర్గ్ అతిపిన్నవయస్కురాలు కాగా.. ఈ ఏడాది 78 ఏళ్ల అతిపెద్ద వయస్కుడిగా బైడెన్ ఎంపికవటం గుర్తించదగిన విషయంగా పేర్కొంది టైమ్ మ్యాగజైన్.