Tuesday, May 21, 2024
- Advertisement -

భారీ లాభాల‌తో స్టాక్ మార్కెట్లు…

- Advertisement -

సోమవారం మార్కెట్లు స‌రికొత్త రికార్డుల‌ను నమోదుచేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ లాభాలను గడించి ఆల్‌టైమ్ హై స్థాయికి చేరింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 331 పాయింట్లు పెరిగి 38,277కు ఎగబాకింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 11,552కు చేరుకుంది.

ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదేజోరును కొనసాగించాయి. ఫలితంగా సూచీలు కొత్త రికార్డులను నమోదుచేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330.87 పాయింట్ల లాభంతో 38,278.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 11,551.75 వద్ద ముగిసింది. ఒకదశలో సెన్సెక్స్ 38,340.69 పాయింట్ల ఆల్‌టైమ్ హై స్థాయికి చేరగా… నిఫ్టీ కూడా 11,565.30 పాయింట్ల ఆల్‌టైమ్ రికార్డుకు చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (18.63%), వెల్స్ పన్ కార్ప్ (11.46%), పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (7.96%), జిందాల్ సా లిమిటెడ్ (7.22%), ఎల్ అండ్ టీ (6.74%).

టాప్ లూజర్స్:
గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (-5.92%), ఫెడరల్ బ్యాంక్ (-5.62%), గ్రాఫైట్ ఇండియా (-4.95%), టీటీకే ప్రిస్టేజ్ (-4.22%), తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్స్ (-3.84%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -