Friday, May 10, 2024
- Advertisement -

భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు భారీ పతనం కావడంతో కుదేలైన దేశీయ ఈక్వీటీ మార్కెట్లు చివరి వరకు అలానే కొనసాగాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌ను చ‌విచూస్తున్నాయి.

ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేంత వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఆ తర్వాత కొంత పుంజుకుని చివరకు 759 పాయింట్ల నష్టంతో 34,001 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 10,234కు పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎంఎంటీసీ లిమిటెడ్ (18.43), హిందుస్థాన్ పెట్రోలియం (14.70), మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (10.58), హెచ్ఈజీ లిమిటెడ్ (9.37), హిందుస్థాన్ కాపర్(8.08).

టాప్ లూజర్స్:
ఎన్ఐఐటీ టెక్నాలజీస్ (11.54), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (10.89), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (10.78), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (8.70), జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ (8.55).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -