Thursday, May 2, 2024
- Advertisement -

క్లాస్‌లో ఫ‌స్ట్ రాలేద‌ని.. తుపాకీతో పేల్చుకొని విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

- Advertisement -

ప‌రీక్ష‌ల్లో ఫెయిల‌యితే బాధ‌ప‌డ‌డం అంటే ఏమో అనుకోవ‌చ్చు. బాగా చ‌దివే అమ్మాయి.. క్లాస్‌లో టాప్ ఫై మెరిట్ స్టూడెంట్స్‌లో మూడో స్థానంలో ఉండే విద్యార్థిని అలాంటి విద్యార్థిని త‌ర‌గ‌తిలో ఫ‌స్ట్ రావాల‌ని చాలా క‌ష్ట‌ప‌డింది. చివ‌రికి ఫ‌లితాల విడుద‌ల‌తో త‌ర‌గ‌తిలో ఫ‌స్ట్ రాలేద‌ని బాధ‌ప‌డింది. ఈ బాధ‌తో ఏకంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తాను తరగతిలో ఫస్ట్‌ రాలేదని పదకొండో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలోని జింద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇండస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆమె చదువుతోంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. అయితే క్లాస్‌లో తాను ఫస్ట్‌ రాలేదని మన‌స్తాపానికి గురైంది.

తండ్రి తుపాకీ తీసుకుని ఇంట్లో తనను తాను కాల్చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు ప్ర‌క‌టించారు. అమ్మాయి టాయ్‌లెట్‌లో మరణించి కనిపించిందని ఆమె పక్కన తుపాకీ ఉంది. చదువులో వెనుకబడడంతో అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. వేద్‌పాల్‌కు ముగ్గురు పిల్లలు కాగా వారిలో పెద్దమ్మాయి ఈమె. వేద్‌పాల్‌ గ్రామ పెద్దగా వ్యవహరిస్తుంటారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -