- Advertisement -
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని.. అత్యంత పురాతన సూర్యభగవానుడి ఆలయంలో.. మరోసారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయ భానుడి లేలేత కిరణాలు నేరుగా స్వామివారి మూలవిరాట్ ను తాకాయి. ఏడాదికి రెండుసార్లు మాత్రమే కనిపించే దృశ్యాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు.
ఈ కిరణాల స్పర్శవలన దేవతామూర్తుల విగ్రహాలు బంగారు వర్ణంతో ధగధగ మెరిసిపోయాయి.