మహోన్నత నేత వైఎస్ ఆర్ లక్షణాలను పుణికిపుచ్చుకున్న తనయుడు వైఎస్ జగన్ దివంగత నేత ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రలను ఎదురుకుంటూ.. ప్రజల ఆదరాభిమానంతో.. జగన్ దూసుకుపోతున్నారు. యువనేత ఆధ్వర్యంలో జగన్ గెలుస్తారు అనుకున్న సమయంలో చంద్రబాబు అబద్దపు హామీలతో, పవన్ కల్యాణ్ ను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో సక్సెస్ సాధించ్చాడు. అయినా జగన్ వెనకడుగు వేసినా.. ఆ తర్వాత పంజా విసిరినట్లు.. ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ 2019లో విజయం లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు జగన్.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడిగా జగన్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు టీడీపీ అభిమానులను వణికిస్తోంది. ” మీరు చూపించిన ప్రేమే నాకు కొండంత ధైర్యం’ అని పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆ ప్రేమ ఇచ్చిన ధైర్యంతోటే తాను ఆరేళ్ల కిందట పార్టీని స్థాపించి దూసుకెళుతున్నామని, తన తండ్రి, అందరి ప్రియతమ నేత వైఎస్ఆర్ కలలు నెరవేర్చేందుకు ముందుకెళుతున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ట్విట్టర్లో పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. మరింత వేగంగా ముందుకెళదామని, ప్రతి పేదవాడి కళ్లల్లో సంతోషం చూసే తరుణం మరెంతో దూరంలో లేదని, ఏడాదిలో అందరం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గర్వంగా, ఆత్మసంతృప్తితో అందరం పనిచేసుకుంటూ ఎల్లకాలం ఇలాగే కొనసాగాలంటూ ట్వీట్ చేశారు.. వైఎస్ జగన్ పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రతి వైఎస్ అభిమాని షేర్ చేస్తున్నారు… జగన్కు ఏపీలో రోజు రోజుకీ ప్రజాదరణ పెరిగిపోతుండడంతో, ఆందోళన చెందుతున్న టీడీపీ అభిమానులకు ఈ ట్వీట్ మరింత వణికిస్తుందనడంలో సందేహం లేదు.