Friday, May 24, 2024
- Advertisement -

రామోజీపై దుమ్మెత్తిపోస్తున్న తెలుగుదేశం అభిమానులు!

- Advertisement -

ఈనాడు పత్రికాధినేత రామోజీరావు అంటే… తెలుగుదేశం పార్టీ అభిమానులకు ప్రత్యేక అభిమానం. ఎంతో గౌరవం. ఆ గౌరవం అంతా ఎందుకో వేరే చెప్పనక్కర్లేదు..

తమ పార్టీ కి రామోజీ రావు అందించే సహకారాన్ని బట్టే రామోజీని తెలుగుదేశం పార్టీ అభిమానులు గౌరవిస్తున్నారు. ఈనాడు పత్రికలో తెలుగుదేశం పార్టీ వార్తలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈమాత్రం నిలదొక్కుకొంటున్నాడంటే… దాంట్లో ఈనాడు సహకారం ఎంతో ఉంది. 

మరి అలాంటి గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకున్న వ్యక్తిపై ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు తెలుగుదేశం అభిమానులు. తమ పార్టీ కి రాజగురువు లాంటి వ్యక్తిపై వారు విరుచుకుపడుతున్నారు. ఆయన తీరును తప్పుపడుతున్నారు. ఆయన సిగ్గులేకుండా వ్యవహరించారని కూడా వీరు విమర్శిస్తూ ఉండటం విశేషం. మరి రామోజీపై తెలుగుదేశం అభిమానులు ఉన్న ఫలంగా ఇంత ఆగ్రహావేశాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు. దీనికంతటికా కారణం రామోజీ, జగన్ మోహన్ రెడ్డిలు సమావేశం కావడమే!

ఒకవైపు చంద్రబాబు రామోజీకి ఎంతో విలువనిస్తున్నాడని.. రామోజీకి పద్మవిభూషణ్ ఇప్పించాలని కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని అయితే ఇలాంటి నేపథ్యంలో రామోజీ జగన్ ల సమావేశం జరిగిందని.. జగన్ తో సమావేశమై రామోజీరావు తప్పుచేశాడని తెలుగుదేశం అభిమానులు అంటున్నారు. మొత్తానికి.. ఈనాడు అధినేతపై తెలుగుదేశం పార్టీ వారు ఈ విధంగా విరుచుకుపడటం ఆసక్తికరమైన అంశమే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -