చైనాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సెంట్రల్ చైనాలోని మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో చోటు చేసుకుంది. హెనాన్ ప్రావిన్స్లోని షాంగ్కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో శుక్రవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయని స్థానిక మీడియా తెలిపింది.
ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ నెల 13న సెంట్రల్ హుబెయి ప్రావిన్స్లో గ్యాస్ పైప్లైన్ పేలుడు సంభవించడం 25 మంది మరణించగా..138 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే.
భద్రతా నిర్వహణలో లోపాలు బయటపడడంతో కంపెనీకి చెందిన ఎనిమిది మంది ఉద్యోగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నారు సంతోషం : నారా లోకేష్
మద్యం మానేశానంటున్న హీరో శింబు.. కారణం?
హుజూరాబాద్ లో ‘దుబ్బాక’ సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది : ఎమ్మెల్యే రఘునందన్ రావు