Wednesday, May 8, 2024
- Advertisement -

నందమూరి అక్కా చెల్లెళ్ళ మధ్య కొత్త చిచ్చు

- Advertisement -

సినిమా – రాజకీయాల పరంగా ఎన్ని విభేదాలు, మనస్పర్ధలూ , తగాదాలూ ఉన్నా విడిపోకుండా కలిసి ఉంది మాత్రం నందమూరి ఫామిలీ ఒక్కటే అని చెప్పాలి. తమ తమ రాజకీయ మార్గాలు ఎలా ఉన్నా , సినిమాల పరంగా ఎవరు ఏ స్థానం లో ఉన్న పైకి మాత్రం అంతా ఒకటే అనట్టు కనీసం అనిపించేలగా బెహేవ్ చేస్తూ ఉంటారు.

ఒకరి మీద ఒకరు చక్కగా ఎలాంటి కంప్లైంట్ లు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి కుటుంబానికి చెందినా వ్యక్తిగత ఫంక్షన్ లలో నందమూరి ఐక్యత చక్కగా కనిపిస్తూ ఉంటుంది. పార్టీల్లో ఉన్న వారు తప్పక కలుస్తూనే ఉంటారు. ఐక్యత గా ఉండే నందమూరి కుటుంబం లో ఇపుడు కొత్త చిచ్చులు రేగే లాగా కనిపిస్తోంది.

 తెలుగు దేశానికి చెందిన ఎమ్మెల్సీ ఒకరు నందమూరి అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవ పెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. భాజాపా లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తన మరిది చంద్రబాబు మీద ఎలా విరుచుకుని పడేవారో అలాగే ఆమె ఇప్పుడు కూడా మిత్ర పక్షం అయినా కూడా రెచ్చిపోతున్నారు. అయితే ఇది ఉపయోగించుకుని విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు తన చెల్లెలు భువనేశ్వరి ని చూసి ఓర్వలేకనే, పురందేశ్వరి చంద్రబాబునాయుడు సర్కారు మీద విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ఓ కొత్త వాదన లేవదీశారు. 

ముఖ్యమంత్రికి ఆమె భార్య అవడం తో ఆమె చెల్లెలి సంతోషం, హోదా చూడలేక ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని బుద్దా అంటున్నారు. ముఖ్యమంత్రి కంటే కేంద్ర మంత్రికే ఎక్కువ స్థానం ఉంది, అలాంటి కేంద్ర మంత్రి పదవిలో ఉండి వచ్చిన పురందరేశ్వరి కి ఈ పదవులు కొత్తా ? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -