Sunday, April 28, 2024
- Advertisement -

పవన్ ఎఫెక్ట్..అసంతృప్తిలో బుద్దా వెంకన్న!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తు కుంపటి చల్లారడం లేదు. ఈ రెండు పార్టీల నుండి పలు నియోజకవర్గాల్లో సీటు ఆశీస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పలు నియోజకవర్గాల్లో సీటు తమకంటే తమకని నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా విజయవాడ పశ్చిమలో టీడీపీ – జనసేన విభేదాలు తారస్థాయికి చేరాయి.

విజయవాడ పశ్చిమ సీటు తనకు కేటాయించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న భారీ ర్యాలీ చేపట్టారు. తన నివాసం నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ వరకు ర్యాలీచేపట్టారు. విజయవాడ వెస్ట్ స్థానాన్ని జనసేనకు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు వెంకన్న.

ఎన్నికల్లో నిలబడటానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని… విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని కోరారు. తన అప్లికేషన్ పరిశీలించాలని చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌ను కోరారు వెంకన్న. అయితే ఈ రెండు స్థానాలు జనసేన ఇస్తారనే ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ నేతలు త్యాగం చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -