Friday, May 17, 2024
- Advertisement -

లోకేష్ పై ఆరోపణలు కాదు ఆధారాలు చూపించు!

- Advertisement -

తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబుపై కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేసిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది.

ఊరికే ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయాలి.. అంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించాడు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ల నుంచి లోకేష్ కు ఐదొందల కోట్ల రూపాయల లంచాలు అందాయని  రఘువీరారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.

దీనిపై తెలుగుదేశం పార్టీ తరపున మంత్రి స్పందిచాడు. రఘువీరారెడ్డి ఒక అడ్రస్ లేని పార్టీకి నాయకుడని పుల్లారావు వ్యాఖ్యానించాడు. అడ్రస్ లేని వాళ్లు చేసే విమర్శలకు తాము ప్రాధాన్యత ఇవ్వమని.. అయినా రఘువీర చేసిన ఆరోపణల్లో పస ఉంటే.. ఆధారాలు చూపాలని పుల్లారావు సవాలు విసిరారు.
రఘువీరా నోరు కంట్రోల్ లో పెట్టుకొంటే మంచిదని హితవుపలుకుతూ అనవసరమైన ఆరోపణలు చేయవద్దని పుల్లారావు సూచించాడు. మరి దీనిపై రఘువీరారెడ్డి ఎలా స్పందిస్తాడో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -