Tuesday, May 14, 2024
- Advertisement -

తెలుగుదేశం పార్టీ మహేశ్ బాబును అలా సొంతం చేసేసుకొంది!

- Advertisement -

ఇప్పటికే మహేశ్ బాబును తమ వాడు అని అంటోంది తెలుగుదేశం. మహేశ్ తండ్రి కృష్ణ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అయినా.. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయినా… తెలుగుదేశం పార్టీ మాత్రం మహేశ్ బాబును తమ వాడు అని అంటుంది.

అందుకు ప్రత్యేకమైన రీజన్లున్నాయి. మహేశ్ వాళ్ల బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ హోదాలో ఉన్నాడు. ఎన్నికల ముందు తన బావ జయదేవ్ కు మద్దతుగా మహేశ్ ట్వీట్లు కూడా పెట్టాడు.

ఇలాంటి నేపథ్యంలో మహేశ్ ను తెలుగుదేశం వారు ఓన్ చేసుకొన్నారు. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఆ పార్టీ వాళ్లు ఇంకో అడుగు ముందుకు వేసి.. మహేశ్ కు మరింత దగ్గర చేసుకొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫిషియల్ ఫేస్ బుక్ పేజీలో మహేశ్ కు కృతజ్ఞతలు చెబుతూ.. ఆయనను ఆకాశానికి ఎత్తేస్తూ ఒక పోస్టు పెట్టారు. ఎందుకంటే.. ఇటీవల మహేశ్ బాబు తన సొంత గ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకొంటున్నట్టుగా ప్రకటించాడు కదా అందుకు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుకు స్పందనగా మహేశ్ ఆ గ్రామాన్ని దత్తత తీసుకొన్నాడని.. ఈ విధంగా ప్రిన్స్ రియల్ లైఫ్ హీరో అయ్యాడని తెలుగుదేశం పార్టీ అఫిషియల్ ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టారు. ఈ విధంగా టీడీపీ మహేశ్ ను మరింతగా ఓన్ చేసుకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -