Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రపంచకప్‌లో తిరుగులేని భారత్..

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 8వ మ్యాచ్‌లో గెలుపొందింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 327 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్లు, ముఖ్యంగా జడేజా ధాటికి పేకమేడలా కుప్పకూలిపోయింది దక్షిణాఫ్రికా.డికాక్ 5,బావుమా 11,వాన్‌డెర్ డుస్సేన్ 13,మార్‌క్రమ్ 9,క్లాసెన్ 1,జాన్సెన్ 14,మిల్లర్ 11 పరుగులు చేసి విఫలం అయ్యారు. జడేజా 5,బుమ్రా , కుల్దీప్ తలో రెండు వికెట్లు తీశారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు రోహిత్. 24 బంతుల్లో రోహిత్ 40 పరుగులు చేయగా కోహ్లీ అజేయ సెంచరీతో రాణించారు. బర్త్ డే సందర్భంగా సెంచరీ చేసి రాణించిన కోహ్లీ 101 పరుగులతో అజేయ సెంచరీతో ఆకట్టుకోగా శ్రేయాస్ 77 పరుగులతో మరో హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో జడేజా ధాటిగా ఆడటంతో భారత్ 5 వికెట్లు కొల్పోయి 326 పరుగులు చేసింది. సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -