Thursday, May 9, 2024
- Advertisement -

ప్రియురాలు ఆ…పని వద్దనందుకు మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్య

- Advertisement -

ప్రియురాలు చాటింగ్ వద్దనండంతో తీవ్ర మనస్థాపానికి గురయిన యువకుడు ఆత్మమత్య చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లో ని బాలాపూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఇక్కడి జిల్లెలగూడలో ఉంటూ, ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న సందీప్ (30) గత కొంతకాలంగా కూకట్ పల్లికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం ఇరు కుంటుంబాలకు తెలిసినా ..పెళ్లికి నిరాకరించారు.

ఈ క్రమంలో ఆర్ధరాత్రి వరకు ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు.తాను ఫోన్ చేస్తానని సందీప్ చెప్పగా, తన పక్కనే చెల్లెలు ఉందని, ఇక ఫోన్ చేయవద్దని ఆమె చెప్పింది. దీంతో అతను మనస్తాపంతో భవంతి మూడవ అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. ప్రేమ నేపథ్యంలో, అమ్మాయి తరఫువారు తమ బిడ్డను చంపేసి, మృతదేహాన్ని అక్కడ పడేసి వుండవచ్చన్న అనుమానాలను సందీప్ తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు ఆకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిలో హత్య జరిగిన ఆనవాళ్లు లేవని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, రిపోర్టు వచ్చిన తరువాత మృతికి కారణం తెలుస్తుందని తెలిపాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -