- Advertisement -
రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్. టీడీపీ నేత రేంవంత్ రెడ్డి కాంగ్రెస్ ఖండువా కప్పుకోవడంతో ఆయన నియేజక వర్గంలోని నేతలు కారెక్కారు. నాడు కేసీఆర్ చేసిన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు బాస్ లు ఢిల్లీలో ఉండొచ్చు, కానీ, టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజలే బాస్ లని, వేరే వాళ్లెవరూ బాస్ లు కాదని, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో, వారికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే విషయం రేవంత్ రెడ్డికే కాదు, వాళ్ల నాయకురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా తెలుసని అన్నారు.