టీడీపీకి ప్రతిపక్షపార్టీ నాయకులకంటె సొంతపార్టీనేతలే శత్రువులా తయారవుతున్నారు. ఇన్నాల్లు చినబాబు అని ముద్దుగా పిలుచుకొనే ఐటీమంత్రి,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబుకు అతి పెద్ద సమస్యగా మారుతున్నారు.
రాను రాను చినబాబు తీరు శృతిమించిపోతోంది.చినబాబు మాటలు వినలేక ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక పార్టీ నాయకులు చెవులు మూసుకుంటున్నారు.
{loadmodule mod_custom,GA1}
అతి చెత్త, అత్యంత దారుణమైన, దుర్మార్గమైన పార్టీ ఏదన్నా వుందంటే..’ అంటూ ఓసారి గట్టిగా లంకించుకున్న చినబాబు, వైఎస్సార్సీపీ పేరు చెప్పాలనుకున్నారుగానీ, ఆ ఘనతను తెలుగుదేశం పార్టీకి ఆపాదించేశారు.టీడీపీకి ఇంకో శతృవు అక్కర్లేదు..’ అని సరదాగా సెటైర్లు కూడా వేసుకున్నారు తెలుగు తమ్ముళ్ళు.
ఆ తర్వాత, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్కి సంబంధించి జయంతికి వర్ధంతి శుభాకాంక్షలు చెప్పేసిన ఘనుడిగా వార్తల్లోకెక్కారు నారా లోకేష్.లేటెస్ట్గా చినబాబు నుంచి వచ్చిన ‘ఆణిముత్యం’ లాంటి డైలాగ్ ఏంటో తెలుసా.? స్వర్గీయ పీవీ నరసింహారావు, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానిగా ఎంపికయ్యారట. అలాగని చినబాబు సెలవిచ్చారండోయ్.
మీడియా ముందు, చినబాబు ప్రతీసారి ‘చిలిపి వ్యవహారాలపై’ సమాధానం చెప్పుకోలేక నానా తంటాలూ పడ్తున్నారు టీడీపీ నేతలు.
{loadmodule mod_custom,GA2}
ఇక ప్రతిపక్షాలకు ఆయుధాన్ని చినబాబే అందిస్తున్నారు.చినబాబును పొగడలేక…ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక బాబుతోపాటు టీడీపీ నాయకులు తికమక పడుతున్నారు.టీడీపీకి జగన్ శత్రువుకాదు చినబాబులోకేషే శత్రువులా తయారవుతున్నారనండంలో సందేహంలేదు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}pCe8J6i5y-4{/youtube}