Friday, March 29, 2024
- Advertisement -

గత రాత్రి ఘోర ప్రమాదం.. స్పందించిన ప్రధాని మోదీ..!

- Advertisement -

పశ్చిమ్​ బంగాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్​పాయీగుడీ జిల్లా ధుప్​గుడీలో గత రాత్రి జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించారు. ఓ రాళ్ల ట్రక్కు.. మారుతీ వ్యాన్​, టాటా మ్యాజిక్​ కార్లను ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది.పొగ మంచు కారణంగానే రోడ్డుపై వాహనాలు కనిపించలేదని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -