- Advertisement -
ఆర్టికల్ 370 రద్దు తో పాకిస్థాన్ రగిలిపోతోంది. తాను పెంచి పోషిస్తున్నఉగ్రమూకలను భారత్ పై దాడులకు ఉసిగొల్పుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
పంజాబ్, రాజస్ధాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన ముజహిదీన్ బెటాలియన్ సైన్యం సహకారంతో చొరబాట్లను ప్రోత్సహించవచ్చన్న సమాచారంతో ఈ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ బీఎస్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లకు కూడా హెచ్చరికలు పంపింది. మరో వైపు పాకిస్థాన్ నుంచి ఎటువంటి ఘటన ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు నియంత్రణరేఖ వద్దకు సైన్యం అదనపు బలగాలను తరలించింది.