- Advertisement -
కాబూల్ రక్తమోడింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పై ఓ తీవ్రవాది ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు. సెంట్రల్ కాబూల్ లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దాడిలో 24 మంది అక్కడికక్కడే మరణించగా అనేక మంది గాయపడ్డారు.
ఈ దుర్ఘటనకు పాల్పడింది తామేనంటూ దాలీబన్ ఉగ్రవాద సంస్ధ ప్రకటించింది. దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో దేశ రక్షణ శాఖ, ఇంటెలిజెన్సీ కార్యాలయాలున్నాయి. దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.