ఈ మద్య నేరస్తులు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఈజీ మనీ కోసం ఎలాంటి దుశ్చర్యలకైనా తెగబడుతున్నారు. ఓ షాపు దోచుకోవడానికి వచ్చిన కరడుగట్టిన నేరస్థులును ఓ చిన్నారి మనసు మార్చింది. దేశరాజదానిలోని ఫరీదాబాద్ ప్రాంతంలో ఇటీవల జరిగిన దోపిడీ కేసును స్థానిక పోలీసులు ఇటీవల ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. సుమిత్, మనోహర్, అజెయ్, సౌరవ్ అనే కరడుగట్టిన నేరస్థులు ఈ నెల తొమ్మిదో తారీఖున నగదు బదిలీ చేసే మనీట్రాన్స్ఫర్ షాపులో దోపిడికీ పాల్పడ్డారు.
ఆ షాపు యజమానికి తుపాకీ గురి పెట్టి అందినంత దోచుకొని వెళ్లారు. వాస్తవానికి ఆ షాపు యజమానికి తిరగబడితే కాల్చి వేసి డబ్బు తీసుకు వెళ్లాల్సిన టార్గెట్ లో ఉన్నారట.. తమ దగ్గర దాచి ఉంచిన తుపాకీని బయటకు తీస్తుండగా.. కానీ అంతలోనే షాపు యజమాని కూతురు(6) తలుపు తోసుకుని లోపలికి వచ్చి తన తండ్రితో ఏదో ముచ్చట పెట్టి దొంగల వైపు చిరునవ్వుతో చూసింది.
ఆ చిన్నారిని చూసి తన ముందే తండ్రిని కాల్చితే తట్టుకోలేదని మనసు మార్చుకొని ఆ చిన్నారి తిరిగి వెళ్లిపోయేంత వరకూ ఓపిగ్గా ఎదురు చూసి ఆ తరువాత షాపు యజమానికి బెదిరించి.. సొమ్ముతో పారిపోయారు. పోలీసులు నిందితులను వెతికి పట్టుకొని విచారించగా ఈ విషయం చెప్పారట. ఏది ఏమైనా ఆ చిన్నారి తన తండ్రిని కాపాడుకుందని అంటున్నారు నెటిజన్లు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఆద్యా న్యూస్ తరుపున అందరికీ శుభాకాంక్షలు.
నగరంలో మళ్లీ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్!