Thursday, March 28, 2024
- Advertisement -

నగరంలో మళ్లీ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్!

- Advertisement -

హైదరాబాద్ లో మళ్లి చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం కరోనా కష్ట కాలంలో మనిషికి మనిషి సహాయం చేసుకోవాల్సింది పోయి.. చైన్ స్నాచర్స్ మాత్రం రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలను టార్గెట్ చేసుకొని కేటుగాళ్లు తమ పనులు పూర్తి చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మెడలో నుండి గొలుసు లాక్కొని వెళ్ళిపోయాడు.

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉంటున్న కవిత అనే మహిళ మెడికల్ షాపు నుంచి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి వెనుకనే వెంబడిస్తూ వచ్చాడు. చుట్టూ ఎవరూ లేనిది గమనించి ఆ మహిళ మెడలో నుండి మూడు తులాల గొలుసు చోరీ చేసి అక్కడి నుండి పారిపోయాడు. హఠాత్తుగా జరిగిన సంఘటనతో మహిళ షాక్ కి గురైంది.. వెంటనే తేరుకొని అరుస్తూ కొంత దూరం ఆ చైన్ స్నాచర్ ని వెంబడించింది.

అయితే అప్పటికే అవతలి రోడ్డుపై బైక్ తో మరో వ్యక్తితో ఆ కేటుగాడు ఉడాయించాడు. దీంతో వెంటనే ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డైన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. అధికారుల్లో టెన్షన్..!

జూలై ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి ‘సర్కారు వారిపాట’..!

వైద్య పరీక్షల కోసం అమెరికాకు బయల్దేరిన రజనీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -