- Advertisement -
రక్షణ రంగంలో భారత్, ఇజ్రాయెల్ కలిసి అరుదైన ఘనత సాధించాయి. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల సామర్థ్యం ఉన్న(ఎంఆర్ఎస్ఎమ్) క్షిపణిని ఇరు దేశాలు విజయవంతంగా పరీక్షించాయి. గత వారంలో ఈ పరీక్షను నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) మంగళవారం తెలిపింది.
పరీక్షలో భాగంగా.. ఈ ఎంఆర్ఎస్ఎమ్ క్షిపణిని భూమి నుంచి మొబైల్ లాంచర్తో ప్రయోగించగా.. విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిందని వెల్లడించింది. ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రయోగ పరీక్షలో ఇజ్రాయెల్, భారత్కు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఈ అధునాతన ఎంఆర్ఎస్ఎమ్ యుద్ధ క్షిపణి గగనతలంలో శత్రువుల నుంచి రక్షణ అందించగలదు. 50-70 కి.మీ దూరం నుంచి శత్రు విమానాలపై దాడి చేయగలదు.