Saturday, May 11, 2024
- Advertisement -

ఈ ఇద్దరి కాంబినేషన్ చాలా ఫైర్..!

- Advertisement -

రక్షణ రంగంలో భారత్​, ఇజ్రాయెల్​ కలిసి అరుదైన ఘనత సాధించాయి. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల సామర్థ్యం ఉన్న(ఎంఆర్​ఎస్​ఎమ్)​ క్షిపణిని ఇరు దేశాలు విజయవంతంగా పరీక్షించాయి. గత వారంలో ఈ పరీక్షను నిర్వహించినట్లు ఇజ్రాయెల్​ ఏరోస్పేస్​ ఇండస్ట్రీస్(ఐఏఐ) మంగళవారం తెలిపింది.

పరీక్షలో భాగంగా.. ఈ ఎం​ఆర్​ఎస్​ఎమ్​ క్షిపణిని భూమి నుంచి మొబైల్​ లాంచర్​తో ​ప్రయోగించగా.. విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిందని వెల్లడించింది. ఇజ్రాయెల్​ రక్షణ పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రయోగ పరీక్షలో ఇజ్రాయెల్​, భారత్​కు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఈ అధునాతన ఎంఆర్​ఎస్​ఎమ్​ యుద్ధ క్షిపణి గగనతలంలో శత్రువుల నుంచి రక్షణ అందించగలదు. 50-70 కి.మీ దూరం నుంచి శత్రు విమానాలపై దాడి చేయగలదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -