చికెన్ ఓ కుంటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. చికెన్ ఏంటీ ప్రాణాన్నీ తీసిందంటునుకుంటున్నారా…? అలాంటి కొన్ని దురదృష్ట సంఘటనలు కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు కుంటుంబాల్లో చిన్న చిన్న సమస్యలు అంటె ఆహారపు అలవాట్లు కూడా కుటుంబాల్లో తీరని ఆవేదాన్ని మిగిలిస్తుంటాయి. ఆలాంటి సంఘటనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అసలు విషయానికి వస్తే…
తమ పాపకు మాంసాహారం తినిపించినందుకు భార్య తనను తిట్టడంతో భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్లోని గోమతినగర్లో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో నివసించే ఉమా శంకర్ అనే డెర్మటాలజిస్ట్ కి మాంసాహారం అంటే చాలా ఇష్టం. అయితే, అతడి భార్యకు మాత్రం మాంసాహారం అంటే ఇష్టం ఉండదు. తమ పాప (6) ను కూడా మాంసాహారానికి దూరంగా ఉంచాలని ఆమె అనుకునేది. తాజాగా ఉమా శంకర్ తన క్లినిక్ నుంచి ఇంటికి వెళుతూ ఓ హోటల్లో నాన్వెజ్ పార్సిల్ కొనుక్కుని వెళ్లాడు.
తన కూతురికి కొద్దిగా మాంసాహారాన్ని పెట్టి మిగిలింది తిన్నాడు. పాపకు ఎందుకు మాంసం పెట్టావంటూ శంకర్ భార్య దీప్తి ఆయనను తిట్టింది. గొడవ ముగిశాక అందరూ పడుకున్నారు. అయితే, మనస్తాపానికి గురైన శంకర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.