Thursday, May 2, 2024
- Advertisement -

కేసిఆర్ కి తిట్టే ముందు ఇది ఆలోచించండి…!

- Advertisement -

అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్… రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో రూ.3వేల కోట్లతో 13 లిప్ట్ ఇరిగేషన్​లను మంజూరు చేసిన ఘనత సీఏం​దేనని నల్గొండలోని తన కార్యాలయంలో తెలిపారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కేసీఆర్​ కృషి చేయడం వల్లే అధిక పంటల పండించడంలో పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణ వెల్లంల, శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్​లో నిధులు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాదిలోపు పనులు పూర్తి అవుతాయని తెలిపారు.

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్న ముఖ్యమంత్రిని… ప్రతి పక్షాలు నోటికి ఎదివస్తే అది మాట్లాడటం సరికాదని అన్నారు. కేసీఆర్​ను ఎంత దూషిస్తే మీకు అంత పాపం తగులుతుందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో భాజపా నాయకులు పోలీసులపై జరిపిన దాడిని ఖండిస్తూ… తప్పు చేసినవారిని చట్టం శిక్షిస్తుందన్నారు. ఎల్లుండి 10న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -