- Advertisement -
తెలంగాణలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేస్తున్న డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల అభ్యర్ధిత్వానికి మజ్లిస్ పార్టీ తన మద్దతు తెలిపింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకులు ఈటల రాజేందర్, హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి అసదుద్దీన్ ఒవైసీని కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.
దీంతో ఆయన సరేనన్నారు. అయితే వారి మద్దతు లేకపోయినా రెండు స్ధానాలను టిఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. అయితే స్నేహపూర్వకంగా కోరడంతో వారు సరేనన్నారని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు మంగళవారం నాడు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వేరే పార్టీల నుంచి పోటీ లేకపోవడంతో వీరిద్దరి ఎన్నిక లాంఛనమే.