Monday, April 29, 2024
- Advertisement -

మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన ఆంగ్ల చానెల్

- Advertisement -

కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా నరేంద్ర మోదీ కొలువులో మంత్రులకు ఓ ఛానెల్ ర్యాంకులు ప్రకటించింది. వారు ఇచ్చిన ర్యాంకుల ప్రకారం రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరికి తొలి ర్యాంకు దక్కింది. ఆ తర్వాత ర్యాంకును విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ దక్కించుకున్నారు.

రక్షణ శాఖ మంత్రి మనోహర్ పాలికర్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ర్యాంకుల్లో వరుస స్ధానాలు పొందారు. జీఎఫ్టీ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడం, పెట్టుబడుల ఉపసంహరణ నత్తనడకన సాగడం, రైల్వే ప్రయివేటీకరణ, కార్మిక సంస్కరణలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలపై కార్పొరేట్ వర్గాలు మోదీ సర్కార్ పై అసంత్రప్తితో ఉన్నట్లు ఆ ఛానెల్ తన సర్వేలో పేర్కొంది.

అయితే దేశంలో వ్యాపార వాతావరణం పెరిగిందని, ఇందుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని 67 శాతం మంది సిఈవోలు సంత్రప్తిని వ్యక్తం చేసినట్లు ఆ ఛానెల్ పేర్కొనడం విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -