వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత నారాయణ రెడ్డిని దారణ హత్యకు గురయ్యారు. పరిగి మండలం సుల్తాన్ పుర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఓ వర్గానికి, నారాయణ రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ నాయకులే నారాయణ రెడ్డిని హత్య చేయించారని కాంగ్రెస్ నాయకులపై నారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేశారు.
పొలానికి వెళ్తున్న ఆయనను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నారాయణరెడ్డి గతంలో నార్మ్యాక్స్ డైరెక్టర్గా ఉన్న సమయంలో గ్రామంలోని కొందరు యువకులతో ఆయనకు గొడవలు జరిగాయి. మరోవైపు, నారాయణరెడ్డి అనుచరులు కొందరు ఇటీవల కాంగ్రెస్లో చేరారు. దీంతో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా పరిస్థితి వేడెక్కింది.
నారాయణరెడ్డిని అంతం చేయాలని భావించిన ప్రత్యర్థులు ఉదయం పొలానికి వెళ్తున్న ఆయనపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నారాయణరెడ్డి మృతితో గ్రామంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.