Friday, May 17, 2024
- Advertisement -

“తెలంగాణా రాష్ట్రం దివాలా తీసింది “

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా.. ఆయన సర్కారుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కేసీఆర్ పాలనలోని లోపాల్ని తీవ్రస్థాయిలో ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు రమణ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు.

టీఆర్ ఎస్ పాలన మొత్తం కేసీఆర్ కుటుంబ కనుసన్నల్లో సాగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉందని.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తున్న తీరుతో దివాలా రాష్ట్రంగా మార్చారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టు రీ డిజైనింగ్ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు తెలుగు తమ్ముళ్లను కలిశారు. ఈ సందర్భంగా తమ గోడును  వెళ్లబుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు రద్దుతో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందన్న రమణ.. కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Related 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -