- Advertisement -
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు కల్వర్టును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు. మృతులు మల్కాజ్గిరికి చెందిన లోకేశ్, కిరణ్కుమార్గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.