చాటింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…భారత సంతతికి చెందిన జెస్సికా, మితేష్లకు మాంచెస్టర్ యూనివర్సిటీలో చదివే సమయంలో స్నేహం ఏర్పడింది. తర్వాత కొన్నాళ్లకు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.కొన్నాళ్లు వీరి కాపురం బాగానే సాగింది.తరువాత ఏమైందో తెలియదు కాని జెస్సికా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో మితేష్పై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు పలు షాకింగ్ నిజాలు వెల్లడించాడు.మితేష్ ఓ గే వెబ్సైట్లో చాటింగ్ చేసేవాడట.గే డేటింగ్ యాప్ ద్వారా సిడ్నీకి చెందిన డాక్టర్ అమిత్ పటేల్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. దీంతో భార్య జెస్సికాను ఎలాగైన హత్య చేయాలని భావించాడు.
హత్యకు ముందే జెస్సికా పేరు మీద రెండు మిలియన్ పౌండ్ల జీవిత బీమా కూడా చేయించాడు.భార్యతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూనే ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఓ రోజు జెస్సికా ఫార్మసీ నుంచి ఇంటికి రాగానే ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆమె చేతులు కట్టేసి, ప్లాస్టిక్ కవర్ను ముఖం చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.భార్యను ఎంతగానో ప్రేమించే మితేష్ ఆమెను హత్య చేశాడంటే మొదట కుటుంబ సభ్యులు కూడా నమ్మలేకపోయారు.ఇకపోతే మితేష్ ప్రవర్తన మొదటి నుంచి అనుమానంగానే ఉండేదని చెబుతున్నారు యూనివర్సిటీ విద్యార్థులు.డేటింగ్ యాప్లో ప్రిన్స్ అనే మారుపేరుతో మితేష్ చాటింగ్ చేసేవాడని, ఈ విషయం ఫార్మసీలో అందరికీ తెలిసనప్పటికీ వారు రహస్యంగా ఉంచడని తెలుస్తుంది.