ఎవరైనా చెట్టు ఎందుకు ఎక్కుతారు. చెప్పుకుంటె పండ్లు కోయడానికి చెట్లు ఎక్కుతారు.కానీ ఒ మంత్రి కూడా చెట్టెక్కారు. అది ఏవో కోయడానికి కాదు.తన సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చెట్టు ఎక్కాల్సి వచ్చింది.ఇది ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏంటీ మీరు నమ్మట్లేదా…! నిజమండీ…అయితే ఇది చదవండి.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సొంత రాష్ట్రం రాజస్థాన్. అక్కడ ఆయన నియోజకవర్గం బికనీర్. ఆ నియోజవకర్గం పరిధిలోని ఢోలియా అనే గ్రామంలో కొన్ని సమస్యలు ఉండటంతో వాటి పరిష్కారం కోసం ఆయన అక్కడకు వెళ్లారు. గ్రామంలోని ఆస్పత్రిలో నర్సులు తగినంతగా లేరని స్థానికులు ఆయనకు మొరపెట్టుకున్నారు. దాంతో సంబంధిత ఉన్నతాధికారికి వెంటనే ఫోన్ చేసి, సమస్యను పరిష్కరిద్దామని కేంద్రమంత్రి మేఘ్వాల్ అనుకున్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
అనుకున్నదే తడవుగా జేబులోంచి సెల్ఫోన్ తీశారు. కానీ తీరాచూస్తే అందులో సిగ్నల్ ఒక్క పాయింటు కూడా లేదు. ఇదేంటని అక్కడ ఉన్నవాళ్లను అడిగితే, ఈ గ్రామంలో సెల్ఫోన్ మాట్లాడాలంటే చెట్టు ఎక్కాల్సిందేనని చావుకబురు చల్లగా చెప్పారు.దీంతో ఆయన చెట్టు ఎక్కుతానని చెప్పారు. ఆయన కోసం వెంటనే ఒక నిచ్చెన తెప్పించడంతో దాని సాయంతో ఆయన చెట్టు ఎక్కారు. అధికారితో ఫోన్ మాట్లాడి సమస్య గురించి వివరించిన అనంతరం మళ్లీ కిందకు వచ్చారు.
{loadmodule mod_custom,Side Ad 2}
Also read