Wednesday, May 1, 2024
- Advertisement -

లడ్డూ తెచ్చిన తంటా…విడాకులకోసం కోర్టుకెక్కిన భర్త

- Advertisement -

వరకట్న వేధింపులు.. అత్తింటి వారి హింస, భర్త చిత్రహింసలు తట్టులోకేక విడాకులు తీసుకున్న దంపతుల కేసులగురించి ఇప్పటి వరకూ విన్నాం. కాని ఇప్పుడు వింటున్నది విచిత్రమైన విడాకులకేసు. తన భార్య ఇంట్లో భోజనానికి బదులుగా లడ్డూలు పెట్టి వేధిస్తోందనీ, వెంటనే తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెల్తే… బాధితుడికి పదేళ్ల క్రితం వివాహమయ్యింది. ఓ బాబు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యంలో ఓ తాంత్రికుడి వల్ల విబేధాలు మొదలయ్యాయి. భర్త అనారోగ్యానికి గురి కావడంతో భార్య ఓ తాంత్రికున్ని ఆశ్రయించింది. ‘నీ భర్త ఆరోగ్యం బాగుపడాలంటే అతనికి ఉదయం 4, సాయంత్రం 4 లడ్డూలు తినిపించు’ అని సలహా ఇచ్చాడు.

దీంతో ప్రతీ రోజు భార్య ఉదయం, సాయంత్రం నాలుగు లడ్డూలు వడ్డించడం ప్రారంభించింది. రోజూ లడ్డూలు తినలేక విసుగొచ్చింది. లడ్డూలతో తన భార్య రోజూ చంపేస్తోందని కోర్టుముందు వాపోయాడు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తర్వాత వారిలో మార్పు రాకుంటె విడాకులు మంజూరు చేస్తామని కోర్టు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -