Saturday, April 20, 2024
- Advertisement -

పంజాబ్ లో టీకా ఆయనకే ముందు..!

- Advertisement -
Vaccination in Punjab before him

కొవిడ్​పై పోరులో ముందుండి పోరాడుతున్న వారికే మొదటి దశలో టీకా అందిస్తామని పంజాబ్​ ప్రభుత్వం ప్రకటించింది. టీకాను ఐసీఎంఆర్​ ఆమోదించిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ తీసుకోనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 1.25 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా అందించనున్నారు. పంజాబ్​లో కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్​ పంపిణీ సన్నద్ధత అంశాలపై వర్చువల్​గా జరిగిన కేబినెట్​ భేటీలో అమరీందర్​ సింగ్​ పాల్గొన్నారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్​లైన్​ వర్కర్స్​, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే మరో 70 లక్షల (రాష్ట్ర జనాభాలో 23 శాతం)మందికి మొదట టీకా అందించాలని పంజాబ్​ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్​ పంపిణీపై కేంద్ర వ్యూహానికి తగ్గట్టుగా పంజాబ్​ ఈ విధానాన్ని అమలు చేయనుంది.

టీకా పంపిణీలో అవాంతరాలు లేకుండా ఉండటానికి, జాతీయ స్టీరింగ్ కమిటీతో ఆ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమన్వయంతో వ్యవహరిస్తోంది. అదే విధంగా బ్లాక్ లెవల్, జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలతో కలిసి రాష్ట్ర టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది.వ్యాక్సిన్​ను​ భద్రపరిచేందుకు కావాల్సిన డీప్​ ఫ్రీజర్లు, టీకా వ్యాన్లు, కోల్డ్​ బాక్స్​లు అందించాలని కేంద్రాన్ని పంజాబ్ సర్కార్​​ కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -