గుళ్లు, బంధువుల ఇళ్లు, పబ్లిక్ కార్యక్రమాల్లో మన చెప్పులపై ఒక ఆందోళన ఉంటుంది. ఎవరు ఎత్తుకెళ్తారోనని టెన్షన్. అందుకని అంటారు చిత్తం శివుడి మీద భక్తి ఏమో చెప్పుల మీద అనే సామెత వచ్చింది. ఇప్పుడు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి చెప్పులే పోయాయంట. ఒక కార్యక్రమానికి వెళ్లగా అతడి చెప్పులు కనిపించకుండాపోయాయి. దీంతో వెతికి వెతికి చివరకు దొరక్కపోవడంతో కొత్తవి కొని వేసుకున్నపరిస్థితి బెంగళూరులో చోటుచేసుకుంది.
ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శుక్రవారం (జనవరి 19) బెంగళూరులో అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఉదయం బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. వెంకయ్యను కలుసుకోవడానికి కేంద్ర మంత్రి సదానంద గౌడతోపాటు పెద్దఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. అరగంటపాటు అక్కడ ఉన్న ఆయన టిఫిన్ పూర్తిచేసి బయటకు వచ్చారు. అయితే ఇక బయటకు వెళ్దామని వస్తే ఇంటి గుమ్మంలో విడిచిన పాదరక్షలు కనిపించలేదు. కొద్దిసేపు వెతికినా తర్వాత.. అవి పోయినట్టు వెంకయ్య భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంకయ్యను చూడటానికి వచ్చినవారిలో ఎవరో వేసుకొని వెళ్లి ఉంటారని భావించారు. అయితే కొత్తవి కొనడానికి ప్రయత్నించారు. కానీ ఆ సమీపంలో పాదరక్షల దుకాణాలు తెరచుకోలేదు. అవి తెరుకునేంత వరకు వెంకయ్య నాయుడు ఆగి అధికారులు కొని తీసుకొచ్చిన కొత్త పాదరక్షలు వేస్కొని కార్యక్రమానికి పోయిన పరిస్థితి. కొత్త పాదరక్షలు వేసుకొని వెంకయ్యనాయడు వెళ్లిపోయారు.