Friday, May 17, 2024
- Advertisement -

భారత్ తో వియత్నాం.. హై స్పీడ్ గార్డ్ కోసమేనేమో..?

- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధాని నుగుయెన్​ జువాన్ ఫుక్​తో వర్చువల్​గా సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం దిశగా కీలక చర్చలు జరపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ భాగంగా.. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి.

ఈ సదస్సులో ముఖ్యంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధి పరిస్థితిపై చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇరు దేశాలు స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, శాంతియుత, సంపన్నమైన నియమాల ఆధారిత ప్రాంతీయ అభివృద్ధిపై ఆసక్తిని చూపుతున్నాయి.

భారత్​-వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ భవిష్యత్తు అభివృద్ధి కోసం ఇరుపక్షాలూ దృష్టి సారించే అవకాశముంది. వియత్నాం హై స్పీడ్​ గార్డ్​ బోట్ల కోసం భారత రక్షణ లైన్ క్రెడిట్ అమలు గురించి సదస్సులో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -