భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ రహాస్యంగా వివాహం చేసుకుని అందర్నీ ఆశ్యర్యపరిచారు. వీరి వివాహం జరిగిందని కోహ్లీ ప్రకటించే వరకు ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే ఎన్నోసార్లు వీరి పెళ్లి, ప్రేమపై పుకార్లు వచ్చాయి. అలాగే అనుకున్నారు కానీ ఈసారి నిజమైంది. వీరి పెళ్లి ఘనంగా కొద్దిమంది సమక్షంలో అయ్యింది. పెళ్లి, సంగీత్ ఇలా అన్నీ కార్యక్రమాలు విదేశాల్లో జరిగాయి. కేవలం ఇరు కుటుంబసభ్యులు, బంధువులు, కొద్దిమంది స్నేహితులే హాజరయ్యారు. వీరందరికీ ఢిల్లీలో, ముంబాయిలో వివాహ విందు విరుష్క జంట ఇవ్వనుంది. దీనికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఆ లోపు వీరి హనీమూన్ పూర్తవొచ్చనే టాక్ వినిపిస్తోంది. అది అక్కడా ఇక్కడా ఏకంగా ఓ అందమైన దీవిలోనట.
హనీమూన్ను జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఓ దీవిని బుక్ చేసుకున్నారంట. విరాట్ కోహ్లి పెళ్లికి ముందే దక్షిణాఫ్రికాలోని ఒక దీవిని మొత్తం హనీమూన్ కోసం బుక్ చేశాడని తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికాలోని ఒక రహాస్య దీవిలోని లే గార్డెన్ రిసార్ట్స్ అనే రిసార్ట్స్లో వీరి హనీమూన్ జరగనుందట. వివాహమైన తర్వాత జరిగే కొన్నికార్యక్రమాల అనంతరం ఈ జంట ఆ దీవికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్లి ఏకాంతంగా.. సందడిగా గడిపేయనున్నారు.