Thursday, May 2, 2024
- Advertisement -

రెడ్ మీ అదిరిపోయే ఆఫ‌ర్‌…

- Advertisement -

స్మార్ట్ ఫోన్‌ల విక్ర‌యాల్లో భార‌త్ మార్కెట్‌లో దూసుక‌పోతున్న షియోమి సంస్థ మరో కొత్త మోడల్‌ను ఆధునిక ఫీచ‌ర్ల‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త‌క్కువ ధ‌ర‌కే అన్ని ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్‌ను మొబైల్ ప్రియుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్ప‌టికే అనేక మోడ‌ల్ల‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన కంపెనీ ఇప్పుడు భార‌త్‌లోనె త‌యార‌యిన దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌’ పేరుతో ‘రెడ్‌మి 5ఏ’ మొబైల్‌ను అతి త‌క్కువ ధ‌ర‌కే మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధ‌ర‌ రూ.5వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు కంపెనీవెల్లడించింది. మ‌రో వైపు జియో సిమ్ తీసుకుంటె రూ.1000 క్యాష్ బ్యాక్ అఫ‌ర్ రానుంది. ఈ ఆఫ‌ర్ సంవ‌త్స‌రం త‌ర్వాత మొబైల్ వినియోగ‌దారుల‌కు అంద‌నుంది.

స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీ చరిత్రలో షియోమి ఇండియా ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనుంది. అందులో భాగంగానే తొలి 50లక్షల రెడ్‌మి 5ఏ(2జీబీ+16బీజీ)ను రూ.4,999కే అందించనుంది. డిసెంబర్‌ 7 మధ్యాహ్నం 12గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్‌ ప్రారంభం కానుంది.

రెడ్‌మి 5ఏ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ తాకే తెర
స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్‌
16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం
5 ఎంపీ, 13 ఎంపీ ముందు వెనుక కెమెరాలు
ఆండ్రాయిడ్‌ నోగట్‌, ఎంఐయూఐ 9 వెర్షన్‌
మెమొరీకార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్‌
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -