రామ్ చరణ్ మీద యండమూరి వీరేంద్రనాథ్ గతంలో కామెంట్స్ చేసి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అందరూ మర్చిపోయిన ఆ కామెంట్లను మళ్లీ నాగబాబు గుర్తు చేసి.. మరింత చర్చ జరిగేలా చేశాడు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న యండమూరి.. చరణ్ మీద చేసిన వ్యాఖ్యలతో ఆయనకు చాలా దూరమైపోయారు. ఇప్పుడు చిరు హోస్ట్ చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మీద ఆయన చేసిన నెగెటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
పర్టికులర్ గా చిరును ఉద్దేశించి యండమూరి ఏమీ అనలేదు కానీ.. ఎంఈకే షో మీద మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఈ షో విషయంలో ఆయన ఫీలింగ్ ఏంటంటే.. టీవీ అంటే ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్. ఇక కౌన్ బనేగా కరోడ్ పతి.. మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి షోలు వచ్చాయి. ఆ షోలో పాల్గొనాలంటే ముందు మూడు మెసేజ్ లు పంపాలి. ఒక్కో మెసేజ్ కు 5 రూపాయల చొప్పున.. 15 రూపాయలు సమర్పించుకోవాలి. పది లక్షల మంది దగ్గర 15 రూపాయల చొప్పున వసూలు చేసి కోటిన్నర జేబులో వేసుకుంటాడు.
తర్వాత ఐదారు లక్షలు కుక్కకు విసిరినట్లు విసిరితే.. చొంగ కార్చుకుంటూ తీసుకుంటాం. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇంతకంటే హీనం ఇంకొకటి ఉండదు. ఎరవేసి డబ్బులు సంపాదిస్తున్నారు. పేదవాళ్లు.. తినడానికి బియ్యం కూడా లేనివాళ్లు ఆశతో మెసేజ్ లు పంపించి.. 15 రూపాయలు పోగొట్టుకుంటున్నారు. దీని కంటే లాటరీ టికెట్ కొనడం మేలు. లాటరీల్ని బ్యాన్ చేసినందుకు నాకీ ప్రభుత్వం మీద చాలా కోపం ఉంది. దాన్ని బ్యాన్ చేస్తే ఇలాంటి గ్యాంబ్లింగ్స్ అన్నీ బ్యాన్ చేయాలి’’ అని కుండబద్దలు కొట్టాడు యండమూరి.
{youtube}QgakiDJO8nA{/youtube}
Related