Friday, April 26, 2024
- Advertisement -

నాత‌మ్ముడిని బ‌లి ప‌శువుని చేశారు…నిందితుడి శ్రీనివాస్ అక్క‌

- Advertisement -

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచార‌ణ స‌మ‌యంలో న‌న్ను చంపి రాజ‌కీయం రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్నార‌ని నిందితుడు చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శ్రీనివాస్ అక్క సంచ‌ల‌న విష‌యాలను వెల్ల‌డించింది.

తన తమ్ముడితో ఎవరో కావాలనే జగన్ పై హత్యాయత్నం చేయించారన్నారు శ్రీనివాస్ అక్క రత్నకుమారి బాంబు పేల్చింది. వారి పేరు చెబితే హత్య చేస్తామని తన తమ్ముడిని భయపెట్టి వుండవచ్చని, అందువల్లే అతను వారి పేరు చెప్పడం లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. వాళ్లేదో డబ్బు ఆశ పెట్టి వుండవచ్చని, ఆ డబ్బుతోనే శ్రీనివాస్ భూమిని కొనుగోలు చేయాలని భావించివుండవచ్చని తెలిపింది.

తన తమ్ముడి చేతిలో రూపాయి కూడా ఉండేది కాదని… విశాఖ వెళ్లిన తర్వాత ఈ విధంగా తయారయ్యాడన్నారు. ఇప్పుడు వాళ్లు డబ్బులేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, తన తమ్ముడు బలైపోయాడని వాపోయింది. డ‌బ్బుకు ఆశ‌ప‌డే ఈ ప‌ని చేసుంటార‌ని తెలిపింది. ఇప్పుడు వాళ్లు డబ్బులేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, తన తమ్ముడు బలైపోయాడని వాపోయింది.

తమ తమ్ముడి చేతిలో రూపాయి కూడా లేదని, అతను ఇంత దారుణం చేస్తాడని తాము ఊహించలేదని రత్నకుమారి వ్యాఖ్యానించింది. ఎవరో చేయించిన పనికి తన తమ్ముడు బలయ్యాడని తెలిపింది. అసలు శ్రీనివాస్, 9 ఫోన్లను మార్చాడంటేనే నమ్మశక్యం కావడం లేదని, ఎప్పుడూ తన వద్దకు వచ్చి, పెట్రోలు కోసం రూ. 20 , రూ. 30 అడిగి తీసుకు వెళ్లేవాడని చెప్పింది. తాము మొత్తం ఆరుగురమని, ఆరుగురిలో ఒకడు పోయినట్టే అనిపిస్తోందని, ఇక వాడు తిరిగి వస్తాడో, రాడోనన్న ఆందోళనను వ్యక్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -