ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 47వ జయంతి వేడుకులు దేశ, విదేశాల్లో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. సోషియల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘జగనన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. కవితతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
జగన్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. 327వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ దండుగోపాలపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలోనే అభిమానుల మధ్య జగన్ కేక్ కట్ చేశారు.
కవిత ట్వీట్పై జగన్ స్పందించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు కవితమ్మా’ అని ట్వీట్ చేశారు. అలాగే బర్త్ డే విషెస్ చెప్పిన మమతా బెనర్జీకి ధ్యాంక్యూ దీదీ(అక్కా) అంటూ జవాబిచ్చారు.