Friday, May 10, 2024
- Advertisement -

జగన్ రెడ్డి… ఇక దూసుకుపోతాడా..!

- Advertisement -

ఇన్ని రోజులూ ప్రతిపక్ష నేతగా ఎన్ని పోరాటాలు చేసినా.. ఎన్ని ధర్నాలు నిర్వహించినా.. మరేం చేసినా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఒక విషయంలో మాత్రం విమర్శలు వచ్చేవి. అసలు నిన్నలా మొన్న రాష్ట్రానికి వచ్చి వెళ్లిన రాహుల్ గాంధీ కూడా జగన్ పై ధ్వజమెత్తి వెళ్లాడు.

అసలు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోవడానికే ధైర్యం లేని రాహుల్ జగన్ ను విమర్శించి వెళ్లాడు. జగన్ ప్రతిపక్ష నేతగా విఫలం అయ్యాడని చెప్పుకొన్నాడు.

మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గమనించినట్టుగా ఉన్నాడు. ఆయన జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా అంశం గురించి స్పందిస్తానంటున్నాడు. త్వరలోనే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తాను అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాడు. అనంతపురంజిల్లా రైతు భరోసాయాత్ర ముగింపు సందర్భంగాజగన్ ఈ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ఏపీకిప్రత్యేక హోదా అంశంలో తన పోరాటం మొదలుకాబోతోందని జగన్ ఈ విధంగా ఇండికేషన్ ఇచ్చాడు.

మరి ఈ పోరాటం గనుక చేస్తే జగన్ కు తిరుగు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏపీ ప్రజలుప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్నారు. ఏపికి పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటన చేసిన బీజేపీ వాళ్లు ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. ఇక బీజేపీ మిత్రపక్షం కాబట్టి తెలుగుదేశం ఏమీ చేయలేకపోతోంది. కాంగ్రెస్ ఏమైనా చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇలాంటినేపథ్యంలో జగన్ ప్రత్యేక హోదా అంశం గురించి గట్టిగా పోరాడితే.. నాయకుడిగా విజయవంతం అయినట్టే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -