Friday, May 10, 2024
- Advertisement -

ఇచ్చిన ప్ర‌తీ హీమీని అమ‌లు చేసి 2024లో ఓట్లు అడుగుతా…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర నాలోగోరోజు కొన‌సాగింది. అన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకోవ‌డంతోపాటు బ‌హిరంగ‌స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు. ప‌చ్చ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూనె అధికారంలోకి వ‌స్తె ప్ర‌జ‌ల‌కు వివిరిస్తున్నారు.

గ‌న్ మొద‌లు పెట్టిన పాద‌యాత్ర‌ నాలుగో రోజు క‌డ‌ప జిల్లా ఎర్ర‌గుంట్ల నాలుగురోడ్ల సెంట‌ర్ వ‌ర‌కు వ‌చ్చింది. జ‌గ‌న్ యాత్ర‌కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అక్క‌డ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నారని చెప్పారు. 2019లో తాము అధికారంలోకి రాగానే అంద‌రి జీవితాల్లో వెలుగులు నింపుతామ‌ని చెప్పారు.

అధికారంలోకి రాగానె మానిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాల‌ను చేసి చూపిస్తాన‌ని వైఎస్‌ జ‌గ‌న్ చెప్పారు. ప్ర‌తి దాన్ని అమ‌లు చేసి చూపించే 2024లో ఓట్లు అడుగుతాన‌ని అన్నారు. యువ‌కుల కోసం ఉద్యోగాల విప్ల‌వం తెస్తాన‌ని అన్నారు. ప్ర‌త్యేక హోదా కోసం అంద‌రం క‌లిసిక‌ట్టుగా పోరాడ‌దామ‌ని పిలుపునిచ్చారు. క‌డ‌ప జిల్లాకు స్టీల్ ఫ్యాక్ట‌రీ తీసుకొచ్చి, 10 వేల ఉద్యోగాలు క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ల‌క్షా 40 వేల ఉద్యోగాల‌ను ఇస్తాన‌ని తెలిపారు.

పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లిచ్చే సూచ‌న‌లు, స‌ల‌హాల‌తోనె మ్యానిఫెస్టోను రూపొందిస్తాన‌ని తెలిపారు. అసెంబ్లీ ఒక‌వైపు జ‌రుగుతుందని, మ‌రోవైపు త‌మ‌ ఎమ్మెల్యేలు ప్ర‌తి గ్రామంలోనూ తిరుగుతూ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుంటున్నార‌ని అన్నారు. ప్ర‌తి ప‌ల్లెలోకి వెళ్లి ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుంటున్న త‌మ‌ను టీవీల్లో చూపిస్తారో, అసెంబ్లీలో కూర్చొనే ప్ర‌భుత్వ నేత‌లను చూపిస్తారో చూద్దామ‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా ప్ర‌తి ఇంటికి న‌ల్లానీల్లు ఇచ్చిన త‌ర్వాత‌నె ఓట్లు అడుగుతాన‌ని ప్ర‌జ‌ల‌కు హామి ఇచ్చారు. ఇప్పుడు జ‌గ‌న్‌కూడా కేసీఆర్ లాగ‌నె అధికారంలోకి వ‌స్తె మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసిన త‌ర్వాత‌నె ఓట్లు అడుగుతాన‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -