- Advertisement -
నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తుళ్లూరు మండలం మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించనున్నారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదనే కారణంతో మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె చినచంద్రశేఖర్ అనే రైతుకు చెందిన 4 ఎకరాల 79 సెంట్లలోని చెరకు తోటను కొందరు దుండగులు గురువారం రాత్రి తగులబెట్టిన విషయం తెలిసిందే.
మల్కాపురంలో దుండగులు దగ్ధం చేసిన చెరకు తోటను ఆయన పరిశీలించి.. రైతు గద్దె చంద్రశేఖర్ పరామర్శించనున్నారు. గద్దె చంద్రశేఖర్ పొలాన్ని పరిశీలించనున్న వైఎస్ జగన్. అనంతరం ఉద్దండరాయపురంలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తాడు.