వైసీపీలో ఫైర్బ్రాండ్గా పేరుపొందిన మహిళా ఎమ్మేల్యే రోజనే చెప్పాలి.కాని ఆమె విమర్శలు రానురాను పార్టీకీ ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.దీంతో జగన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.జగన్ ఆగ్రహానికి గురయ్యిన రోజాకు ఇబ్బందులు మొదలయ్యాయనే ప్రచారం జరగుతోంది.
{loadmodule mod_custom,GA1}
అలాంటి రోజాకు అధినేత జగన్ హెచ్చరికలు జారీ చేశారనే ప్రచారం ఇప్పుడు చర్చకు దారి తీసింది. రోజా వ్యవహారశైలి, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో జగన్.. రోజాను పిలిపించి గట్టిగా మందలించినట్లుగా ప్రచారం సాగుతోంది
గతంలో కూడా రోజాను పలుమార్లు జగన్ మందలించినప్పటికీ మార్పు రాకపోవడంతో.. ఈసారి మాత్రం కాస్త కటువుగానే చెప్పారని తెలుస్తోంది. తీరు మార్చుకోకుంటే వేటు తప్పదనే సంకేతాలు వెల్లినట్లు సమాచారం.మీడియాలో హైలెట్ అవడానికే రోజా అలా చేస్తున్నారని సొంత పార్టీ నేతలు కూడా చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది.
{loadmodule mod_custom,GA2}
రోజా తీరుతో జగన్కు, వైసిపికి నష్టమని ప్రశాంత్ కిషోర్ చెప్పారని ప్రచారం సాగింది. అధికార పార్టీని పని తీరుతో, వ్యూహాత్మకంగా ఇబ్బంది పెట్టాలి తప్ప మాటలతో ఇష్టం వచ్చినట్లు ఎదురు దాడి చేయడం వల్ల కాదని, రోజాను అదుపు చేయాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.మరి ఇప్పటికైనా రోజాలో మార్పు వస్తాదో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- పార్టీ నాయకుల గురించి జగన్కునివేదిక ఇచ్చిన ప్రశాంత్ కిషోర్..
- వారిద్దరి దూకుడు భవిష్యత్తులో వైసీపీకి ఇబ్బందిగా మారుతుందా….?
- చంద్రబాబుపై వైసీపీ ఫైర్బ్రాండ్ రోజా సంచలన సెటైర్లు..
- లోకేష్పై రోజా సినిమా డైలాగ్ పంచ్ అదిరింది
{youtube}fk0YrZ3uS0E{/youtube}