Sunday, May 19, 2024
- Advertisement -

కేర‌ళ విప‌త్తు హృద‌యాన్ని క‌లచి వేస్తోంది…వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

విశాఖ‌ప‌ట్నం: భారీ వరదలు, ఎడతెగని వర్షాలతో ఛిన్నాభిన్నమైన కేరళ పరిస్థితిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో వరద భీభత్సం చూస్తుంటే హృదయం కలచివేస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఈ కష్ట కాలంలో తనప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయన్నారు. విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్రప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు.

భారీ వర్షాలు, వరదలతో కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -