- Advertisement -
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం వైసీపీదేననె సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. గెలుపుపై ధీమా ఉన్న నేతలు జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నా. తిథి, వార, నక్షత్రాలు కూడా అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి మే 26న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
జ్జల రామకృష్ణారెడ్డి మాటలను బట్టి చూస్తే జగన్ ప్రమాణస్వీకారం మే 26న ఉంటుందని అర్థం అవుతోంది. అయితే, ఆరోజే ప్రమాణస్వీకారం చేయడానికి చాలా కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. తిథి,వారం, నక్షత్రం అన్నీ కలిసివచ్చేలా ఆ రోజు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం.